నామినేటెడ్‌ అభ్యర్థుల మద్దతు కోరిన ప్రధాని

న్యూఢిల్లీ: చిల్లర వర్తకంలో ఎఫ్‌డీఐల అంశంపై నేడు రాజ్యసభలో ఓటింగ్‌ జరగనున్న నేపథ్యంలో ప్రధాని మన్మోహన్‌సింగ్‌ నామినేటెడ్‌ సభ్యులకు ఫోన్‌ చేసి మద్దతు కోరారు. ప్రభుత్వ నిర్ణయానికి మద్దతివ్వాలిందిగా విజ్ఞప్తి చేశారు. రాజ్యసభలో పది మంది నామినేటెడ్‌ సభ్యులకు ఆయన ఫోన్‌ చేశారు. అయితే ఇందులోక్రికెటర్‌ సచిన్‌ టెండ్కులర్‌ నేడు రాజ్యసభకు హాజరుకావడం లేదు. ఆయన కోల్‌కతాలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో ఆడుతున్నారు.