నాయీబ్రాహ్మణ కుటుంబానికి రావుల పరామర్శ ,ఆర్థిక చేయూత

నాయీబ్రాహ్మణ కుటుంబానికి రావుల పరామర్శ ,ఆర్థిక చేయూత

వనపర్తి బ్యూరో సెప్టెంబర్27 (జనంసాక్షి)అశ్విని కేశవులు అనారోగ్యంతో బాధపడుతూ మరణించాడు.ఇట్టి విషయాన్ని నాయీబ్రాహ్మణ పెద్దలు తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, వనపర్తి మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డి  దృష్టికి తీసుకువచ్చారు స్పందించిన రావుల కుటుంబసభ్యులను ఫోన్ ద్వారా పరమార్శించి ఆందోళన  వద్దు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
 పార్టీ నాయకులు వనపర్తి మాజీ జెడ్పిటిసి సభ్యులు ఏర్పుల వెంకటయ్య యాదవ్ , వనపర్తి పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నందిమల్ల అశోక్  ద్వారా తక్షణసహాయంగా కేశవులు భార్య అశ్విని  5000రూపాయలు అందజేశారుఅశ్విని కేశవులు మృతదేహంపై పూలమాలు  వేసి నివాళులు అర్పించిన వారిలో సదుర్ల.సంపత్,వెంకట్రాములు,ఆంజనేయులు,సత్యం,చిదంబరం, రామస్వామి అధ్యక్షులు మోహన్ తదితరులు ఉన్నారు.