నాలుగు దశాబ్దాల తర్వాత ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు అలుగు పారడం శుభపరిణామం

చెరువులో జల పూజ కార్యక్రమం నిర్వహించిన :- మర్రి నిరంజన్ రెడ్డి
రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం,(జనంసాక్షి):- ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కేంద్రంలోని పెద్ద చెరువు గత నాలుగు దశాబ్దాల నుండి ఈరోజు పూర్తిగా నిండి అలుగు పారుతున్న సందర్భంగా ఈ ప్రాంత ప్రజలు, రైతులు, ప్రజలందరూ, సుఖ సంతోషాలతో, సుభిక్షంగా, పాడి పంటలతో, అష్టైశ్వర్లతో  ఉండాలని జల పూజ కార్యక్రమం  నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు & తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏ బ్లాక్) సభ్యులు మర్రి నిరంజన్ రెడ్డి,  అధ్యర్యం లో నిర్వహించారు ఈ కార్యక్రమానికి  ముఖ్య అతితులుగా జాతీయ కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి, మంచాల మండల జెడ్పీటీసీ మర్రి నిత్య నిరంజన్ రెడ్డి,  పిసిసి కార్యదర్శి కొత్త కుర్మ శివకుమార్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఈసి శేఖర్ గౌడ్ హాజరయ్యారు,ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాదాపు 40 సంవత్సరాల తరువాత ఇబ్రహీంపట్నం చెరువు అలుగు పారడం చాలా సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మండల పార్టీ అధ్యక్షుడు కోమ్మిడి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పండాల శంకర్ గౌడ్ ,కిసాన్ సెల్ నాయకులు గుండ్ల వెంకట్ రెడ్డి,సొసైటీ డైరెక్టర్ ఎదుల్ల జంగ రెడ్డి, కౌన్సిలర్ సునీత వెంకట్ రెడ్డి,ఎంపీటీసీ జయ నందం, కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్రి రామ్ రెడ్డి,సంరెడ్డి మహిపాల్ రెడ్డి,కిసాన్ సెల్ నాయకులు తాళ్ళ పల్లి కృష్ణ,మాజీ సర్పంచ్ బుపతి గళ్ళ రాజు, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేనమొని యాదగిరి, సోప్పరి రవి కుమార్ , గోపాల్,మోహన్ రెడ్డి, కమలాకర్ రెడ్డి, మనోజ్ రెడ్డి,  ప్రదీప్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు,యువజన సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.