నిమజ్జనం సందర్భంగా అన్నదానం,పండ్ల పంపిణీ

బషీరాబాద్ సెప్టెంబర్ 25,(జనం సాక్షి) బషీరాబాద్ మండలం కేంద్రంలో శ్రీ బాలాజీ స్వీట్ హౌస్ యజమాని గణేష్, రమేష్ దాదా కలిసి అంబేద్కర్ విగ్రహం వద్ద వినాయక సమితి అధ్వర్యంలో గణపయ్య విగ్రహాన్ని పెట్టి నిత్యం పూజలు భజనలు చేసి తొమ్మిదవ రోజు నిమర్జనం సందర్భంగా ఎనిమిదవ రోజున అన్నదాన కార్యక్రమం చేపడుతూ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల,జిపిఎస్, బ్రిలియంట్ పాఠశాలలో విద్యార్థి, విద్యార్థులకు, ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అరటిపండ్లు పంపిణి చేశారు. ఈ సందర్భంలో వారు భగవంతుని కోరుకుంటూ ప్రజల అష్టైశ్వర్యాలతో చల్లంగా ఉండాలని ఏకదంతా వినాయకుని కోరుకున్నానని, ఆ భగవంతుని ఆశీర్వాదాలు ఎల్లప్పుడు మాపైన ఉండాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో హేమ్రాజ్, ధనరాజ్,జయంత్ గౌడ్,ఆదర్శ్,కైలాష్ చౌదరి, సాయి,తదితరులు పాల్గొన్నారు.