నియోజకవర్గంలో ఎమ్మెల్యే చిన్నయ్య సుడిగాలి పర్యటన. – పలు అభివృద్ధి పనులకు భూమి పూజ.

బెల్లంపల్లి, ఫిబ్రవరి 20, (జనంసాక్షి )
బెల్లంపల్లి నియోజకవర్గంలో సోమవారం ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సుడిగాలి పర్యటన చేశారు. ముందుగా బెల్లంపల్లి మండలం బుదాఖుర్డు గ్రామంలో కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం రూ. 20 లక్షల నిధులతో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు. అక్కడి నుంచి నేరుగా నెన్నెల మండలం కుశ్నపల్లి గ్రామంలో రూ. 10 లక్షల జాతీయ గ్రామీణ ఉపాధి హామీ నిధులతో మంజూరైన సీసీ రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు. వేమనపల్లి మండలం చామన పల్లి గ్రామంలో రూ. 5 లక్షల నిధులతో మంజూరైన సీసీ రోడ్ల పనులను ప్రారంభించారు. నెన్నెల మండలం కోణంపేట గ్రామంలో రూ. 10 లక్షల నిధులతో సీసీ రోడ్ల పనులు, మన్నెగూడెం లో 13 లక్షలు, జంగాల్ పేటలో రూ. 10 లక్షలు, నెన్నెల రూ. 20 లక్షలు, నందుల పల్లిలో రూ. 10 లక్షలు, గన్ పూర్ లో రూ. 13 లక్షలు, జోగాపూర్ లో రూ. 8 లక్షలు, గొల్లపల్లి 13 లక్షలు, మైలారం లో రూ. 20 లక్షల నిధులతో మంజూరైన సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈకార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణ, బెల్లంపల్లి ఎంపీపీ గోమాస శ్రీనివాస్, నెన్నెల ఎంపీపీ సంతోషం రమాదేవి, నెన్నెల జడ్పీటీసీ సింగతి శ్యామల, బెల్లంపల్లి వైస్ ఎంపీపీ రాణి – సురేష్, నెన్నెల వైస్ ఎంపీపీ గురునాదం సుమలత – ప్రేమ్ సాగర్ గౌడ్, బెల్లంపల్లి బీఆరెస్ పార్టీ అధ్యక్షుడు గణేష్ గౌడ్, నెన్నెల బీఆరెస్ పార్టీ అధ్యక్షుడు పంజాల విద్యా సాగర్ గౌడ్, నాయకులు గడ్డం భీమా గౌడ్, సింగతి రాంచందర్, సంతోషం ప్రతాప్ రెడ్డి, నెన్నెల సింగల్ విండో చైర్మన్ మేకల మల్లేష్, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు అశోక్ గౌడ్, బుదాఖుర్డు సర్పంచ్ కృష్ణమూర్తి, కుశ్నపల్లి సర్పంచ్ బెల్లంపల్లి సంధ్యారాణి – మహేష్ రెడ్డి, కోణంపేట సర్పంచ్ కంకణాల తిరుపతి రెడ్డి, మన్నెగూడెం సర్పంచ్ గొర్లపల్లి బాపు, జంగాల్ పేట సర్పంచ్ రావుల సత్యనారాయణ, నెన్నెల సర్పంచ్ తోట సుజాత శ్రీనివాస్, నందుల పల్లి సర్పంచ్ బోయిని మల్లేష్, గన్ పూర్ సర్పంచ్ పంజాల లక్ష్మి, జోగాపూర్ సర్పంచ్ గడ్డం నవీన్ గౌడ్, గొల్లపల్లి సర్పంచ్ ఇందూరి శశికళ రమేష్, మైలారం సర్పంచ్ కొండ లక్ష్మి అంకులు, మండల కో అప్షన్ సభ్యుడు ఇబ్రహీం, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.