నియోజకవర్గ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన బొల్లోజు అయోధ్య చారి

పినపాక నియోజకవర్గం ఆగష్టు 31( జనం సాక్షి): పినపాక నియోజకవర్గ ప్రజలకు సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొల్లోజు అయోధ్య చారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  నియోజకవర్గంలోని వివిధ మండలాల్లోని ప్రజలకు సకల శాస్త్రాలకు అధిపతిగా, బుద్ధికి, జ్ఞానానికి ఆరాధ్యుడిగా కొలిచే దైవం ఆటంకాలను తొలగించే విఘ్నేశ్వరుడిగా కొలువై ఉన్న ఏకదంతుణ్ణి భక్తిశ్రద్ధలతో  పూజించాలన్నారు. గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రజలంతా ఘనంగా జరుపుకోవాలని వారు కోరారు.
గణనాధుని ఆశీసులు అందరిపై ఉండాలని,
అందరికి మంచి జరగాలని, సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. నేటి నుంచి11రోజుల పాటు భక్తి శ్రద్ధలతో ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలన్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కమిటీ వారు జాగ్రత్తలు పాటిస్తూ వినాయక చవితిని ఘనంగా జరుపుకోవాలని సూచించారు. సిపిఐ మండల, పట్టణ అధ్యక్షులు, ఏఐటీయూసీ నాయకులు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.