నిరుపేద వధువుకు పుస్తె మట్టేలు అందజేత.

దౌల్తాబాద్ మండల పరిధిలోని ఇందుప్రియల్ గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన పోతరాజు సత్తవ్వ,లచ్చయ్య కుమార్తె మంజుల వివాహానికి ఎమ్మెన్నార్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మద్దుల నాగేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు ట్రస్ట్ సభ్యులు పుస్సె మట్టేలను అందజేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ నియోజవర్గంలోని నిరుపేదలకు అండగా ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు నర్సింలు, రవీందర్, చందరాజు, స్వామి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.