నిరుపేద విద్యార్థులకు నోట్బుక్ ల పంపిణీ.

,

(జనంసాక్షి)జులై:18 ఫ్రెండ్స్ వెల్ఫేర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుపేద విద్యార్థులను ఆదుకోవాలని ఉద్దేశంతో మల్లాపూర్ మండలం లోని చిట్టాపూర్ గ్రామం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు ప్రాథమిక పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న నిరుపేద విద్యార్థులకు 25 స్టూడెంట్స్ కి లాంగ్ నోట్ బుక్స్ మరియు స్టేషనరీ ఐటమ్స్ పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సూరిగి శ్రీనివాస్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుండి నిరుపేద విద్యార్థులకు ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో పాఠశాలల్లో విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నామని మా వంతు సాయంగా అత్యంత దయనీయ స్థితిలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు నోట్బుక్ లుపంపిణీ చేస్తున్నామని భవిష్యత్తులో కూడా ఇలాంటి అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు పిన్నంశెట్టి శ్రీనివాస్ ప్యాక్స్ చైర్మన్ నేరెళ్ల మోహన్ రెడ్డి సామాజిక కార్యకర్త విష్ణువర్ధన్ రాజు భగత్ ప్రవీణ్ శ్రీనివాస్ ఉపాధ్యాయ బృందం భాస్కర్ మురళి రాజేశం రమేష్ పాల్గొన్నారు