నిర్దేశించిన లక్ష్యం మేరకు అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలి

ఎంపీడీవో విజయలక్ష్మి

హరితహారం లో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి

సర్పంచ్ కంబాలపల్లి ఉదయశ్రీ

ఒకటో వార్డు లో యూజీడీ పనులు ప్రారంభం

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం, జూలై16(జనంసాక్షి):- యాచారం మండల పరిధిలోని నందివనపర్తిలో శనివారం గ్రామ సర్పంచ్ కంబాలపల్లి ఉదయశ్రీ, ఉపసర్పంచ్ మూడెడ్ల గోవర్ధన్ రెడ్డి, వార్డు సభ్యుల ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించడం జరిగింది ఈ గ్రామ సభలో ఎంపిడిఓ విజయలక్ష్మి ఇతరులు పాల్గొన్నారు. సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కోసం నిర్దేశించుకున్న లక్ష్యం మేరకు అభివృద్ధి పనులు పూర్తి చేశామని గ్రామ సభలో గుర్తించబడిన మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు దిశగా చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు, అనంతరం గ్రామస్తులకు ఇంటింటికి మొక్కల పంపిణితోపాటు 1వ వార్డు లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను ప్రారంభించారు. ప్రతి ఇంటి ఆవరణలో పచ్చదనం సంతరించుకునేలా మొక్కలు ఏపుగా పెరిగేలా చూడాలన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ మూడేడ్ల గోవర్ధన్ రెడ్డి, వార్డు సభ్యులు కొండూరి రామనాధం, ఓరిగంటి రాధికా, బండి ఉమారాణి, గౌర పావని, కొండాపురం నాగరాజు, టి. అనిత, ఎండి. హైమ