నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులపై బాబు దృష్టి
శరవేగంగా చేపట్టాలని అధికారులకు సూచన
బాబుతో భేటీ అయిన నటి దివ్యవాణి
అమరావతి,నవంబర్22(జనంసాక్షి): మార్చిలోగా నిర్మాణంలో ఉన్న అన్ని ప్రాజెక్టులు పూర్తిచేయాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశించారు. అమరావతి- అనంతపురం ఎక్స్ ప్రెస్వేకి సంబంధించి చిత్తూరు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్నతో సీఎం ఫోన్లో మాట్లాడారు. ఎన్నికలకు ముందే ఎక్స్ప్రెస్ వే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని సూచించారు. వచ్చే కలెక్టర్ల సమావేశానికి కార్యాచరణ ప్రణాళికతో రావాలన్నారు. అలాగే కనకదుర్గ ్గ//-ల ఓవర్ను ఎట్టిపరిస్థితుల్లో మార్చిలోగా పూర్తిచేయాలని సంబంధిత అధికారులకు చంద్రబాబు ఆదేశించారు.ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుతో ప్రముఖ సినీ నటి దివ్యవాణి గురువారం భేటీ అయ్యారు. ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఆమె చంద్రబాబును కలిశారు. అనంతరం ఆమె విూడియాతో మాట్లాడుతూ… చంద్రబాబు దార్శనికత వల్ల ఏపీ ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. అలాగే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో ప్రచారం నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నానని చంద్రబాబుకు చెప్పానన్నారు.