నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న జగన్‌ సర్కార్‌: రామకృష్ణ

అమరావతి,ఫిబ్రవరి23(జనం సాక్షి): జగన్‌ సర్కార్‌ నిన్నటి దాకా ఏం పట్టించుకోలేదని.. ఇప్పుడు చీమ కుట్టినట్టు ఉలిక్కి పడుతోందని సీపీఐ రామకృష్ణ పేర్కొన్నారు. అంగన్‌వాడీ, ఆశావర్కర్ల డిమాండ్లు నెరవేర్చమంటే నిర్బంధిస్తున్నారన్నారు. గ్రావిూణ, రైతుల సమస్యలపై చర్చకు రావడం లేదన్నారు. లక్షల ఎకరాల్లో పంట నష్టం జరుగుతున్నా లెక్కలు తీయడం లేదని విమర్శించారు. కేంద్ర బృందం పంట నష్టాన్ని పరిశీలించినా చర్యలు శూన్యమన్నారు. పంటనష్టంపై చర్యల కోసం గురువారం ’కరువు, వరద బాధితుల రణభేరి’ నిర్వహించనున్నట్టు రామకృష్ణ తెలిపారు