నిర్వాసితులను పట్టించుకోవడం లేదు

ఏలూరు,జనవరి3(జ‌నంసాక్షి): ఓ వైపు పోలవరం పనులు శరవేగంగా సాగుతున్నాయి.  కాంక్రీట్‌ పనులు ప్రాంభం కావడంతో నిత్యం చురకుగా పనులు సాగుతున్నాయి.  అయితే నిర్వాసితుల ఆందోళనలను కూడా కొనసాగుతున్నాయి. తమ సమస్యలు పరిష్కరించాలని పోలవరం నిర్వాసితులు చేపట్టిన రిలే నిరాహారదీక్షలు 50 రోజులు దాటినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఇందులో భాగంగా కళ్లకు గంతలు కట్టుకుని నిరసన ప్రదర్శన, మానవహారం నిర్వహించారు. నిర్వాసితుల ఆందోళనకు సిపిఎం సంఘీభావం తెలిపింది.  ప్రాజెక్టు కోసం సర్వత్యాగం చేస్తున్న నిర్వాసితులే దేవుళ్లు అంటున్న
చంద్రబాబుకు ఇక్కడ దీక్షలు చేస్తున్న నిర్వాసితులు కన్పించలేదా అని ప్రశ్నించారు. పరిహారం. పునరావాసం, భూమికి భూమి ఇవ్వడంలో నిలర్‌క్ష్యం ఉందన్నారు.