నిలిచిన రైళ్ల రాకపోకలు

ఒడిశా(జ‌నం సాక్షి): భారీ వర్షాలతో కోరాపుట్ – రాయగఢ్ మధ్య రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. పల్‌మస్కా స్టేషన్ వద్ద కోరాపూర్ – విశాఖపట్నం వెళ్లే ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్, భవనేశ్వర్ – జగదల్‌పూర్ మధ్య నడిచే హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్‌లను నిలిపివేశారు. కొండల నుంచి వరద నీరు ట్రాక్‌పై ప్రవహిస్తుండటంతో రైళ్ల రాకపోకలను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. వరద తగ్గగానే ట్రాక్ పునరుద్ధరణ అనంతరం రైళ్లు ముందుకు సాగుతాయని పేర్కొన్నారు.