నీట్‌ లీకేజీ విస్తృతి కొంతవరకే..

` అది కేవలం బీహార్‌, జార్ఖండ్‌లకే పరిమితమైంది
` కాబట్టి పరీక్షను రద్దు చేయాల్సిన అసవరం లేదు
` మరోసారి సుప్రీం కీలక వ్యాఖ్యలు
న్యూఢల్లీి(జనంసాక్షి):నీట్‌ యూజీ 2024 పరీక్ష ప్రశ్నపత్నం లీకేజీ వ్యవహారంలో సుప్రీంకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ పరీక్షను రద్దు చేయాల్సిన అవసరం లేదంటూ ఇటీవల కీలక తీర్పునిచ్చిన ధర్మాసనం.. అందుకుగల కారణాలను వివరిస్తూ శుక్రవారం మళ్లీ తీర్పు వెలువరించింది. ఈసందర్భంగా నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ లోపాలను ధర్మాసనం ఎత్తిచూపింది. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా తక్షణమే లోపాలను సరిదిద్దుకోవాలని సూచించింది. నీట్‌ పేపర్‌ లీకేజీలో ఎలాంటి వ్యవస్థీకృత ఉల్లంఘనలు చోటుచేసుకోలేదు. పరీక్ష పవిత్రతను దెబ్బతీసేలా విస్తృత స్థాయిలో లీక్‌ జరగలేదు. ప్రశ్నపత్రం లీకేజీ రaార్ఖండ్‌లోని హజారీబాగ్‌, బిహార్‌లోని పట్నా వరకే పరిమితమైంది. దానిపై దర్యాప్తు జరుగుతోంది. అందుకే మేం పరీక్షను రద్దు చేయాలనుకోలేదు. అయితే, నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీలో కొన్ని లోటుపాట్లు ఉన్నాయి. విద్యార్థుల భవితకు సంబంధించిన అంశంలో ఇలాంటివి చోటుచేసుకోవడం సరికాదు. ఈ సమస్యను కేంద్రం ఈ ఏడాదే పరిష్కరించాలి. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎన్టీయేదేనని సీజేఐ జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈసందర్భంగా ఎన్టీయే పనితీరు, పరీక్షల్లో సంస్కరణల కోసం నియమించిన ఇస్రో మాజీ చీఫ్‌ కె.రాధాకృష్ణన్‌ నేతృత్వంలోని కమిటీకి సుప్రీంకోర్టు పలు ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్యానెల్‌ను మరింత విస్తరించాలని పేర్కొంది. పరీక్షా విధానంలో లోపాలను సరిదిద్దడానికి అవసరమైన చర్యలపై కమిటీ సెప్టెంబరు 30లోగా తమ నివేదికను అందజేయాలని ఆదేశించింది. పరీక్షా వ్యవస్థను బలోపేతం చేసేందుకు అంతర్జాతీయ సాంకేతిక సంస్థల సాయం తీసుకోవాలని సూచించింది. ఈ నివేదిక అందిన తర్వాత అందులోని అంశాలను అమలుచేసే అంశంపై రెండు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని కేంద్రం, విద్యాశాఖను ధర్మాసనం ఆదేశించింది. ఈ ఏడాది నీట్‌ ప్రవేశపరీక్ష మే 5న దేశవ్యాప్తంగా 4,750 కేంద్రాల్లో జరిగింది. దాదాపు 24 లక్షల మంది అభ్యర్థులు రాశారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి 67 మంది విద్యార్ధులు 720కి 720 మార్కులు సాధించారు. హరియాణాలోని ఒకే పరీక్షా కేంద్రానికి చెందిన ఆరుగురు విద్యార్థులకు తొలి ర్యాంక్‌ రావడంతో అనుమానాలు తలెత్తాయి. దీంతో పేపర్‌ లీకేజీ, ఇతర అక్రమాలపై సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం నీట్‌ యూజీ పరీక్షను మళ్లీ నిర్వహించాల్సిన అవసరం లేదని తీర్పు వెలువరించింది. మళ్లీ పరీక్ష పెడితే 24 లక్షల మంది ఇబ్బంది పడతారని కోర్టు అభిప్రాయపడిరది.