నూతన ఆసరా పెన్షన్లు పంపిణీ
బషీరాబాద్ ఆగస్టు 30,(జనం సాక్షి) బషీరాబాద్ మండల కేంద్రంలో నూతనంగా 1206 ఆసరా పెన్షన్లు స్థానిక ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి చేతుల మీదుగా మంగళవారం రోజున ప్రొసీడింగ్స్, స్మార్ట్ కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేనంతగా తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రానికి ఎంతో అభివృద్ధి జరుగుతుందని సభాముఖంగా చెప్పుకొచ్చారు. తెలంగాణ టిఆర్ఎస్ ప్రభుత్వం గురించి బిజెపి మరియు కాంగ్రెస్ నాయకులు టిఆర్ఎస్ పార్టీ పైన బురదజల్లే మాటలు ప్రజలకు చెబుతున్నారని వాళ్ళ మాటలు నమ్మొద్దని ప్రజలకు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ కరుణ అజయ్ ప్రసాద్, ఎంపీడీవో రమేష్,జెడ్పిటిసి శ్రీనివాస్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ వెంకట్రాంరెడ్డి,మార్కెట్ కమిటీ చైర్మన్ రాజరత్నం,సర్పంచ్ పుడూర్ ప్రియాంక,టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు రాము నాయక్,వివిధ గ్రామాల సర్పంచులు,ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు రాజు రెడ్డి,టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.
