నూతన ఆసరా పెన్షన్స్ అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలి

మంచాల ఎంపిటిసి నరేందర్ రెడ్డి
అదనపు కలెక్టర్ కు వినతిపత్రం అందజేత

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం,(జనంసాక్షి):- ఆసరా పెన్షన్స్ ,వృద్ధాప్య వికలాంగులకు పింఛన్ ఆప్షన్ను ఓపెన్ చేయాలంటూ కలెక్టర్ కి ఫిర్యాదు చేసిన మంచాల ఎంపీటీసీ  ఎడ్మ నరేందర్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
అరులైన ,వృద్ధులు వికలాంగులు గ్రామంలో చాలా మంది ఉన్నారని వాళ్లు అప్లై చేసుకోవడానికి మరి కొన్ని రోజులు ఆప్షన్ ఇవ్వాలని అన్నారు  అర్హులైన వారందరికీ పింఛన్ మంజూరు చేయాలని అట్లాగే సైట్ ఓపెన్ చేయాలని పలుమార్లు అధికారులకు చెప్పినప్పటికీ పట్టించుకోవడంలేదని  ఆయన  ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా  సమస్యను పరిష్కరించాలని కలెక్టర్ సమస్య ను పరిష్కరించాలని అన్నారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ వార్డు నెంబర్లు లింగం గౌడ్ , గ్యార పుష్పమ్మ ,చీర మాధవి ,యూత్ కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి సురేష్ , నాయకులు  సంపత్ కుమార్ ఎ.శ్రీకాంత్ గ్యార రమేష్, రావుల శ్రీనివాస్  వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు

Attachments area