నూతన గ్రామపంచాయతీ వల్లన గ్రామాభివృద్ధి బషీరాబాద్

బషీరాబాద్ మండల పరిధిలో గురువారం రోజున కాశీం పూర్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహం వద్ద మల్కాన్ గిరి గ్రామస్తులు మా గ్రామ పంచాయతీని కాశీం పూర్ గ్రామ పంచాయతీని నుండి వేరు చేసి మల్కన్ గిరి గ్రమని నూతన గ్రామపంచాయతీ గా ఏర్పాటు చేయాలని రిలే నిరాహారదీక్షకు చేస్తున్నారు. ఈ రిలే నిరాహార దీక్ష నాలుగో రోజుకు చేరుకున్న ఈ రిలే నిరాహార దీక్షకు ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం మరియు డివిజన్ సెక్రెటరీ అంబేద్కర్ ప్రజా సంఘం సెక్రెటరీ బుడ్గ జంగం వెంకటేష్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి మల్కాన్ గిరి గ్రామస్తులకు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ వెంటనే మల్కాన్ గిరి గ్రామాన్ని నూతన గ్రామపంచాయతీగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అనంతయ్య,రవీందర్,శేఖర్, బాలకృష్ణ,మదు,రాజు, బిచప్ప,మనెప్పా,మల్లప్ప,కృష్ణ,నర్సిములు,ఎల్లేశం,
 రాజశేఖర్,రమేష్, గ్రామ పెద్దలు,గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.