నేటి నుంచి ఢిల్లీ రాష్ట్రాల ఆరోగ్య మంత్రుల భేటీ

న్యూఢిల్లీ: దేశ ఆరోగ్య ప్రణాళిక కోసం అన్ని రాష్ట్రాల ఆర్యోగ మంత్రులు నేడు ఢిల్లీలో సమావేశం కానున్నారు. రెండురోజుల పాటు జరిగే ఈ సమావేశంలో వివిశ రాష్ట్రాల్లో అమల్లో ఉన్న ఆరోగ్య , కుటుంబ సంక్షేమ కార్యక్రమాలపై సమీక్ష జరుపుతారు. గతేడాది హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ సమావేశంలో వయోవృద్ధులు, యువకులు కోసం కేంద్రం ఓ ఆరోగ్య ప్రణాళిక రూపొందించాలని నిర్ణయించారు. మన రాష్ట్రంతో పాటు దక్షిణాది భయపెడుతున్న డెంగీపై  సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.