నేడు నామినేషన్లు వేయనున్న స్వామిగౌడ్‌

కరీంనగర్‌: ఈరోజు టీఆర్‌ఎస్‌ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులుగా టీఆర్‌ఎస్‌ నేత స్వామిగౌడ్‌, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పాతూరి సుధాకర్‌రెడ్డిలు నామినేషన్‌ వేయనున్నారు. ఈ కార్యక్రమానికి టీఆర్‌ఎస్‌ ఎల్పీ నేత ఈటెల రాజేందర్‌, ఉపనేత హరీష్‌రావు, ఎమ్మెల్యే కేటీఆర్‌ తదతర నాయకులు హాజరుకానున్నారు.