నేడు పవన్ జనపోరాట యాత్ర
కాకినాడ,నవంబర్27(జనంసాక్షి): జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం నిర్వహించనున్న ‘ జన పోరాట యాత్ర ‘ కు మంగళవారం మలికిపురం సెంటర్ భారీగా ముస్తాబవుతోంది. జిల్లా జనసేన పార్టీ కొ ఆర్డినేటర్ రాపాక వరప్రసాద్ ఆధ్వర్యంలో మలికిపురం సెంటర్లో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. జన సైనికుల ఆధ్వర్యంలో బహిరంగ సభ ఏర్పాట్లు సిద్ధమవుతోన్నాయి. తాటిపాక సెంటర్ నుండి మలికిపురం వరకు పలు చోట్ల స్వాగత ద్వారాలు, రోడ్డుకి ఇరువైపులా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మలికిపురం సెంటర్లో పవన్ కల్యాణ్ బహిరంగ సభ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తుతో పాటు ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు చేపడుతున్నారు. జన సవిూకరణ సభ నిర్వహించే ప్రదేశాన్ని రాపాక వరప్రసాద్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కెఎస్ఎన్.రాజు, కునపరెడ్డి రాంబాబు, గెడ్డం తులసి భాస్కర్, కొల్లాబత్తుల ఆశోక్ కుమార్, తదితరులు పాల్గన్నారు.