నేడు సింగపూర్ పర్యటనకు మంత్రి లోకేశ్
అమరావతి, డిసెంబర్25(జనంసాక్షి) : సింగపూర్ ప్రభుత్వం అందించే అరుదైన గౌరవాన్ని స్వీకరించేందుకు బుధవారం ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్ సింగపూర్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నెల 26, 27, 28 తేదీల్లో ఆ దేశంలో పర్యటించనున్నారు. సింగపూర్ ఆరో అధ్యక్షుడు ఎస్ఆర్ నాథన్ స్మారకార్థం ఆ దేశ ప్రభుత్వం అందించే ఎస్.ఆర్ నాథన్ ఫెలోషిప్ను లోకేశ్ అందుకోనున్నారు. ఈ మేరకు ఫెలోషిప్ను అందుకోవాలని మంత్రి లోకేశ్కు ఆ దేశ విదేశీ వ్యవహారాల మంత్రి వివియన్ బాలకృష్ణన్ ఆహ్వానం పంపారు. ఈ
పర్యటనలో భాగంగా పలువురు సింగపూర్ మంత్రులతోనూ లోకేశ్ సమావేశం కానున్నారు.