నేడు హజ్రత్ మహ్మద్ ఫీర్ బాబాన్ షా వలీ (ర.హ) దాదా హజత్ 78వ ఉర్సు ఉత్సవాలు.

నేడు హజ్రత్ మహ్మద్ ఫీర్ బాబాన్ షా వలీ (ర.హ) దాదా హజత్ 78వ ఉర్సు ఉత్సవాలు.

పుల్కల్ జనం సాక్షి 27 : పుల్కల్ మండల పరిధిలోని సింగూర్ గ్రామంలో ఈ నెల 28, 29,30 తేదిలలో 78వ ఉర్సు ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు దర్గా పీఠాధిపతి మహ్మద్ అబిద్ హుస్సేన్ సత్తరుల్ ఖాద్రీ సహేబ్ తెలిపారు. గత 78వ సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలు కుల మతాలతకు అతీతంగా వేలాది మంది ప్రజలు పాల్గొంటున్నారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. దర్గాను రంగురంగుల దీపాలతో అందంగా అలంకరిస్తారు. ఎంతో పవిత్రత కల్గిన గంధం, చాదర్ ఇంటి నుండి తీసుకొని దర్గా లోకి తీసికెళ్లి కీలక ఘట్టాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. 29వ తేదిన పొద్దున కబడ్డీ పోటీలు నిర్వహిస్తారు. సాయంత్రం నాతే మై ఫీల్ సము ఉంటుదన్నారు. రాత్రి అన్నదాన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ముఖ్య అతిథులు అన్నసాగర్ పీఠాధిపతి హజ్రత్ సుఫీ షా మహ్మద్ ఖలీల్ హుస్సేన్ ఉర్ఫ్ జహీద్ హుస్సేన్ సత్తరుల్ ఖాద్రీ పాల్గొంటారని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆయన ఈ ప్రకటనలో కోరారు.