నేడే అమెరికా అధ్యక్ష ఎన్నికలు

ప్రపంచవ్యాప్తంగా పెరిగిన ఆసక్తి

ట్రంప్‌, జోబిడెన్‌లలో ఎవరికి ఛాన్స్‌ దక్కనుందో

వాషింగ్టన్‌,నవంబర్‌2(జ‌నంసాక్షి): ప్రపంయచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న అగ్రరాజ్యం అమెరికాలో నవంబర్‌ 3న అధ్యక్ష ఎన్నికలు జరుగబోతున్నాయి. మరికొన్ని గంటల్లో జరగబోయే ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నాలుగేళ్ల అధ్యక్ష అనుభవంతో రిపబ్లికన్ల అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌.. ఒబామా హయాంలో ఉపాధ్యక్షుడు, 40 ఏళ్ల రాజకీయ అనుభవంతో డెమొక్రాట్‌ పార్టీ తరఫున జో బైడెన్‌ మధ్య పోరు ¬రా¬రీగా సాగింది. విజేత ఎవరో తెలిసేందుకు ఇంకా సమయమున్నా.. కొన్ని నెలలుగా దేశం మొత్తవ్మిూద వేర్వేరు సంస్థలు నిర్వహిస్తున్న ఒపీనియన్‌ పోల్స్‌ గెలిచేదెవరో చూచాయగా చెప్పేస్తున్నాయి. ఒపీనియన్‌ పోల్స్‌ తారుమారైన చరిత్ర ఉన్న నేపథ్యంలో ఈనెల 3న జరిగే ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. అధ్యక్ష ఎన్నికలలో 2020 అక్టోబర్‌ 29వ తేదీ నాటికి అత్యధికంగా 8.63 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇది ఈ శతాబ్దపు రికార్డుగా భావిస్తున్నారు. దేశమంతటా కోవిడ్‌ సమస్య ఉండటంతో ఓటర్లు ఎవరికి వారు వీలుని బట్టి ఓటు వేస్తున్నారు. ఓటర్లలో చైతన్యం పెరిగిందనీ, మొదటిసారి ఓటేస్తున్న యువత, ఓటు హక్కు కొత్తగా వచ్చిన విదేశీయులు కూడా ముందస్తు ఓటింగ్‌లో ఉత్సాహంగా పాల్గొన్నారని అంటున్నారు. దాదాపు దేశమంతా ముందస్తు ఓటింగ్‌ రికార్డు స్థాయిలో పెరిగింది. ముందస్తు ఓటర్లలో ఆఫ్రికన్‌ అమెరికన్ల సంఖ్య మామూలుగానే ఉందని తెలుస్తోంది. ముందుగానే ఓటు హక్కు వినియోగించుకున్న వారిలో 27 శాతం మంది కొత్త ఓటర్లని తేలింది. 2016లో 10 శాతం ముందస్తు ఓటు వేసిన ఈ వర్గం వారిలో ఇప్పటికి 9శాతం మంది ఓటేశారు. మంగళవారం కూడా ఎక్కువ శాతం పోలింగ్‌ జరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇకపోతే ఎన్నికల నేపథ్యంలో అమెరికాలోని పలు సంస్థలు అభిప్రాయ సేకరణ చేపట్టాయి. యూనివర్సిటీలు, ప్రైవేట్‌ సంస్థలు నిర్వహించిన ఈ పోల్స్‌ అన్నింటి సారాంశం రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్‌ గెలుపు వాకిట్లో ఉన్నారని తేల్చాయి.. అయితే ఎన్నికల ఫలితాలను కచ్చితంగా తేల్చేందుకు ఇవి పెద్దగా ఉపయోగపడవు. 2016లో హిల్లరీ క్లింటన్‌ దాదాపు అన్ని నేషనల్‌ ఒపీనియన్‌ పోల్స్‌లో కలిపి ట్రంప్‌ కంటే దాదాపు 30 లక్షల ఓట్లు అధికంగా సాధించినా అసలు ఎన్నికల్లో మాత్రం ఓటమి పాలయ్యారు. ఎలక్టోరల్‌ కాలేజీ వ్యవస్థ దీనికి కారణం. ఇక, అక్టోబర్‌ 29న మూడు సంస్థలు నిర్వహించిన ఒపీనియన్‌ పోల్స్‌ ప్రకారం కూడా జో బైడెన్‌దే పైచేయిగా తేలింది. అమెరికా ఎన్నికల్లో ఎవరికి ఎన్ని ఓట్లు పడ్డాయన్నది కాకుండా.. ఏయే రాష్టాల్లో ఎవరికి ఎన్ని ఓట్లు పడ్డాయన్నదే కీలకం. ఉదాహరణకు 2016లో హిల్లరీ క్లింటన్‌కు పాపులర్‌ ఓట్లు ఎక్కువగా పోలైనా ఎలక్టోరల్‌ కాలేజీ ఓట్లు తక్కువగా పడ్డాయి. ట్రంప్‌కు 303 ఎలక్టోరల్‌ కాలేజీ ఓట్లు పడటంతో విజేతగా నిలిచారు. సంప్రదాయకంగా అమెరికన్‌ రాష్ట్రాల్లో ఓటింగ్‌ సరళి దాదాపుగా ఒకేలా ఉంటుంది. మొత్తం 50 రాష్టాల్లో రిపబ్లికన్లకు కొన్ని, డెమొక్రాట్లకు మాత్రమే ఓటేసే రాష్ట్రాలు కొన్ని ఉంటాయి. ఈసారి 38 ఎలక్టోరల్‌ కాలేజీ ఓట్లున్న టెక్సాస్‌ బ్యాటిల్‌గ్రౌండ్‌ రాష్టాల్లో అతి పెద్దది. కేవ లం 4 ఎలక్టోరల్‌ కాలేజీ ఓట్లు ఉన్న న్యూహ్యాంప్గ్‌/ర్‌ అతిచిన్నది. అమెరికా మొత్తవ్మిూద 538 ఎలక్టోరల్‌ ఓట్లు అందుబాటులో ఉండగా, 270 ఓట్లు సాధించిన పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తాడు. బ్యాటిల్‌ గ్రౌండ్‌ రాష్ట్రాల్లో జరిగిన ఒపీనియన్‌ పోల్స్‌ ప్రకారం జో బైడెన్‌ అధ్యక్షుడు ట్రంప్‌ కంటే ఆధిక్యంలో ఉన్నారు. అమెరికా ఎన్నికల్లో ఒపీనియన్‌ పోల్స్‌, బ్యాటిల్‌గ్రౌండ్‌ రాష్ట్రాల పరిస్థితి ఎంత ముఖ్యమో.. అధ్యక్ష స్థానానికి పోటీచేస్తున్న అభ్యర్థుల ముఖాముఖి చర్చలూ అంతే ముఖ్యం.