నేలపాడులో నేడు డ్వాక్రా మహిళల సదస్సు

 

 

 

 

అమరావతి,జనవరి24(జ‌నంసాక్షి): అమరావతిలోని నేలపాడులో శుక్రవారం డ్వాక్రా మహిళలకు చెక్కులను సిఎం చంద్రబాబు నాయుడు పంపిణీ చేయనున్నారు. ఈ సందర్భంగా అక్కడి ఏర్పాట్ల విషయమై గుంటూరు రూరల్‌ ఎస్‌పి ఎస్‌వి.రాజశేఖర బాబు గురువారం అధికారులకు సూచనలిచ్చారు. డ్వాక్రా మహిళల చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇతర ప్రముఖులు హాజరుకానున్నారని, అందుకు తగిన పోలీసు బందోబస్తును, ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నామని ఎస్‌పి తెలిపారు.