న్యాయవాదులకు ఇండ్ల స్థలాలకు కేటాయించాలని వినతి.

న్యాయవాదులకు ఇండ్ల స్థలాలకు కేటాయించాలని వినతి

 

బెల్లంపల్లి, సెప్టెంబర్ 23, (జనంసాక్షి )
న్యాయవాదులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని కోరుతూ శనివారం బెల్లంపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చిప్ప మనోహర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు వినతిపత్రాన్ని అందజేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్ర సాధనలో న్యాయవాదుల జేఏసీ ఉద్యమానికి మద్దతు పలికి కోర్టులను బహిష్కరించి ఉద్యమానికి ఊతం అందించారాని, న్యాయవాదుల కోరికను ప్రభుత్వానికి తెలిపి, న్యాయవాదులకు ఇండ్ల స్థలాలు ఇప్పించే దిశగా కృషి చేస్తానని అన్నారు. ఎమ్మెల్యే హామీ మేరకు బెల్లంపల్లి బార్ అసోసియేషన్ తరపున ధన్యవాదాలు తెలిపారు. ఈకార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి సింగతి రాజేష్, ఉపాధ్యక్షుడు కనుకుంట్ల రాజేష్, మహిళా సభ్యురాలు నల్లుల సంగీత, గ్రంథాలయ అధికారి మద్దిబోయిన శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ సభ్యులు దేవరాజ్ కుమార్, ఉట్ల కుమార్, సజ్జనపు సంతోష్, మాదరి రాకేష్ పాల్గొన్నారు.