న్యాయవాదుల మధ్య ఘర్షణ

భువనేశ్వర్‌,అక్టోబర్‌29(జ‌నంసాక్షి): ఒడిశా హైకోర్టు వద్ద న్యాయవాదుల మధ్య జరిగిన ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది. ఆగస్టు 29న ఓ న్యాయవాదిపై పోలీసులు దాడికి పాల్పడ్డారు. దీనికి నిరసనగా న్యాయవాదులు రెండు నెలలుగా నిరసన వ్యక్తం చేస్తూ కోర్టుకు హాజరుకావడం లేదు. ఈ విషయంలో న్యాయవాదులు రెండు వర్గాలుగా విడిపోయారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఓ వర్గానికి చెందిన న్యాయవాదులు విధులకు హాజరుకావడంతో వివాదం రేగింది. విధులకు హాజరైన వారిని మరో వర్గానికి చెందిన న్యాయవాదులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. ఇది క్రమంగా ఘర్షణకు దారి తీయడంతో హైకోర్టు వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.