పంచలింగాల ప్రాథమికొన్నత పాఠశాలకు విజెఆర్ ఫౌండేషన్ సహాయం

విద్యతోనే సమాజం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందని విజిఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వర్కటం జగన్నాథ్ రెడ్డి అన్నారు. మక్తల్ మండలంలోని పంచలింగాల గ్రామ ప్రాథమికోన్నత పాఠశాలకు 60 వేల రూపాయలు విలువచేసే స్మార్ట్ టీవీ మరియు మైక్ సెట్ ను అందజేశారు. ఈ సందర్భంగా కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు రఘువీర్ నామోజీ మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు వి భీమ్ రెడ్డి  మాట్లాడుతూ వి జెఆర్ ఫౌండేషన్ తరపున స్మార్ట్ టీవీ మరియు మైక్ సెట్ ను అందజేయడం శుభసూచకమని అన్నారు. స్మార్ట్ టీవీ ద్వారా విద్యార్థులకు డిజిటల్ రూపంలో విద్యాబోధన అందించడం జరుగుతుందన్నారు. సాహృదయంతో అందజేసినందుకు పాఠశాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వర్కటం జగన్నాథ్ రెడ్డి మంచి సేవ గుణమున్న నేత అని భవిష్యత్తులో మంచి ఉన్నతమైన స్థాయి కి వెళ్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జడ్పీహెచ్ఎస్ కర్ని కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు రఘువీర్ నామాజీ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వి. భీమ్ రెడ్డి, ఉపాధ్యాయులు కుమార్ ప్రహ్లాద్, జైపాల్, రాజు, గ్రామ సర్పంచ్ తిక్కమ్మ వెంకటప్ప పంచాయతీ కార్యదర్శి రాము ఉపసర్పంచ్ బీరప్ప పాఠశాల ఎస్ఎంసి చైర్మన్ మహాదేవప్ప, వైస్ చైర్మన్  వెంకటప్ప, ఫీల్డ్ అసిస్టెంట్ ఆంజనేయులు గౌడ్, శ్రీనివాసరెడ్డి తదితర గ్రామస్తులు పాల్గొన్నారు.