పందుల పెంపకానికి స్థలం కేటాయించాలని తాసిల్దార్ ను కలిసి వినతి పత్రం అందజేత

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం,(జనంసాక్షి):- ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని ఎరుకల కులస్తుల సంఘం నాయకుల తో కలిసి మున్సిపల్ చైర్మన్ కప్పరి స్రవంతి చందు  ఎమ్మార్వో  రామ్మోహన్ ని కలిసి వినతిపత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా  చేర్ పర్సన్ మాట్లాడుతూ ఎరుకల కులస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను, మున్సిపాలిటీలో ఉన్న ఐదు గ్రామాలలో పూర్తిగా పందులను తొలగిస్తున్న కారణంగా ఎరుకల కులస్తులు జీవనోపాధి కోల్పోతున్నారు కాబట్టి మున్సిపాలిటీకి దూరంగా 5 ఎకరాల భూమిని కేటాయించినట్టయితే అక్కడ శాశ్వత షెడ్లను నిర్మించుకొని జీవనోపాధి పొందుతామని   అన్నారు దీనిపై ఎమ్మార్వో సానుకూలంగా స్పందించి ఉరికి దూరంగా 5 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తానని హామీ ఇచ్చారు