పంద్రాగస్ట్‌కు ప్లాస్టిక్‌ జెండాలు నిషేధం

న్యూఢిల్లీ,ఆగస్ట్‌9(జ‌నం సాక్షి ): స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్లాస్టిక్‌తో తయారు చేసిన జాతీయ జెండాలను ఉపయోగించొద్దని కేంద్ర ప్రభుత్వం దేశ పౌరులకు విజ్ఞప్తిచేసింది. జాతీయ జెండా కోడ్‌ను కఠినంగా అమలు చేయాలని రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలను కోరింది. ఈ మేరకు ¬ం శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు జాతీయ జెండా ప్రాతినిధ్యం వహిస్తోందని, దానికి గౌరవనీయమైన స్థానం ఉందని పేర్కొంది. ప్లాస్టిక్‌ జెండాలతో పర్యావరణం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేసింది. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతన్నారు. ప్లాస్టిక్‌ జెండాలను వినియోగించబోమని పౌరులు ప్రతిన బూనాలన్నారు.