పకడ్బందీగా ధాన్యం కొనుగోళ్లు
` ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది
` కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి పర్యవేక్షించాలి
` మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి
హైదరాబాద్(జనంసాక్షి): ధాన్యం కొనుగోళ్లను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి అన్నారు. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి కొనుగోళ్లను పర్యవేక్షించాలన్నారు.వివిధ జిల్లాల కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పౌరసరఫరాలశాఖ ముఖ్య అధికారులతోనూ సమీక్షించారు. ధాన్యం కొనుగోళ్లపై ఆరా తీశారు. ‘’ ఈ ఏడాది యాసంగిలో రికార్డు స్థాయిలో 127.50 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నాం. వానకాలం, యాసంగి కలిపి 281 లక్షల టన్నుల దిగుబడి వచ్చే అవకాశముంది. అందుకు అనుగుణంగా కొనుగోలు కోసం అధికారులు ఏర్పాట్లు చేసుకోవాలి’’ అని ఉత్తమ్ సూచించారు.