పట్నం ఫ్యామిలీకి పట్టణ తెరాస నేతలు అండగా ఉంటాం.

మున్సిపల్ చైర్ పర్సన్ తాటి కొండ స్వప్న పరిమళ్ గుప్త.

జులై 18(జనంసాక్షి)పట్నం సునీతా మహేందర్ రెడ్డి ఫ్యామిలీకి మేమంతా అండగా ఉంటామని జిల్లా చైర్పర్సన్ సునీతా మహేందర్ రెడ్డికి మున్సిపల్ చైర్ పర్సన్ తాటికొండ స్వప్న పరిమళ్, టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆమెకు భరోసా కల్పించారు. మర్పల్లి మండలంలో జడ్పీ చైర్పర్సన్ పై జరిగిన దాడి సంఘటననేపథ్యంలో సోమవారం చైర్ పర్సన్ స్వప్న ఆధ్వర్యంలో పట్టణ టిఆర్ఎస్ పార్టీ నాయకులు. యువ నేతలు సునీత మహేందర్ రెడ్డి నివాసంలో ఆమెను కలిసి చేయూతనిచ్చారు. సునీతా మహేందర్ రెడ్డి పార్టీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి చేరే విధంగా కృషి చేయాలని సూచించారు. ప్రతి కార్యకర్తకు పట్నం ఫ్యామిలీ అండగా ఉంటుందని పేర్కొన్నారు.ఎవరు కూడా అధైర్య పడవద్దని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో
మాజీ పట్టణ అధ్యక్షుడు అబ్దుల్ రావుఫ్, తాండూర్ పట్టణ మున్సిపల్ చైర్ పర్సన్ తాటికొండ స్వప్న పరిమల్, ఆర్ టిఎ డైరెక్టర్ జావేద్, కౌన్సిలర్స్ బొబ్బిలి శోభరాణి, పట్లోళ్ళ రత్నమాల, సల్మా ఫాతిమా, మణపురం రాము, కో ఆప్షన్ సభ్యులు అబ్దుల్ ఖవీ, బీర్కు
క్ట్ ఉష, పట్లోళ్ళ బాల్ రెడ్డి, బోయ రాజు, బంటు మలప్ప, మసూద్, రొంపల్లి సంతోష్ కుమార్,బీదర్ రాజ్ శేకర్, మాజహర్ గౌరం, అస్నొద్దిన్, రాష్ట్ర యూత్ కార్యదర్శి రఘు, టిఆర్ఎస్వి జిల్లా అధికార ప్రతినిధి దత్తాత్రేయ, అశోక్ ముదిరాజ్ కోట్ల రాజ్ కుమార్ రెడ్డి సిద్దు అయ్యా,మంగలి శ్రీనివాస్, మహేష్,హరీష్ గౌడ్,భారీ ఎత్తున యువకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు