పట్రోల్‌ బంక్‌పై భాజాపా కార్యకర్తల దాడి

కరీంనగర్‌: దిల్‌సుఖ్‌నగర్‌లో జంట పేలుళ్ల ఘటనను నిరసిస్తూ నేడు భాజాపా రాష్ట్ర వ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా కరీంనగర్‌లో ఆ పార్టీ కార్యాకర్తలు ఈ ఉదయం నిరసన ప్రదర్శన చేపట్టారు. నగరంలో తెరిచి ఉంచిన పెట్రోల్‌ బంక్‌ పై దాడి చేశారు. ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. నల్గొండలో ఆ పార్టీ నేతలు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు.