పదోతరగతి పరీక్షల్లో కాపీయింగ్‌ను ప్రోత్సహించిన సిబ్బందిని పట్టుకున్న డీఈవో

మహబూబ్‌నగర్‌ విద్య: పదోతరగతి పరీక్షల్లో బాలనగర్‌ మండలంలోని బాలికోన్నత పాఠశాల పరీక్ష కేంద్రంలో కాపీయింగ్‌ను ప్రోత్సహించిన సిబ్బందిని డీఈవో సుదర్శన్‌రెడ్డి పట్టుకున్నారు. ఆంగ్లపశ్నపత్రంలో వచ్చిన పశ్నలకు పాఠశాల సిబ్బంది సమాధానాలు రాసి వాటిని జిరాక్స్‌ తీసి విద్యార్థులకు అందించారు. ఈ విషయం బయటకు పొక్కడంతో డీఈవో కేంద్రానికి వచ్చి విచారణ చేపట్టారు. విచారణలో కాపీయింగ్‌ను ప్రోత్సహించడం వాస్తవమని తేలడంతో సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.