పరిహారం కోసం రైతుల ఆందోళన

విశాఖపట్టణం,జనవరి24(జ‌నంసాక్షి): నక్కపల్లి మండలంలో పరిశ్రమల ఏర్పాటు కోసం ప్రభుత్వం సేకరించిన భూముల్లో డీ-ఫారం రైతులకు తక్షణమే పరిహారం చెల్లించలంటూ రైతులు వివిధ పార్టీల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. వీరంతా గురువారం తహశీల్దార్‌ కార్యాలయానికి చేరుకొని పరిహారం చెల్లించాలంటూ నినాదాలు చేశారు. అధికారులు భూములపై సర్వే నిర్వహించి వాటిని తీసుకొని ఏడాదిన్నర కావస్తున్నా ఇంత వరకూ ఎటువంటి పరిహారం చెల్లించలేదని వాపోయారు. దీనిపై ఇప్పటికే పలుమార్లు ఆందోళన చేశామని, చేసిన ప్రతిసారి పరిహారం ఇస్తామంటూ మాటలకే పరిమితం అయ్యారన్నారు. తక్షణమే పరిహారం చెల్లించకుంటే ఆందోళనను ఉద్రిక్తం చేస్తామని స్పష్టం చేశారు. అనంతరం తహశీల్దార్‌ జయప్రకాశ్‌కు వినతి పత్రాన్ని అందజేశారు.