పలువురు నాయకుల సంఘీభావం

చండ్రుగొండ  జనంసాక్షి (జులై 27) వీఆర్ఏల సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన నిరసన దీక్ష  బుధవారం నాటికి మూడు రోజులు పూర్తి చేసుకుంది. వారి దీక్షకు సంఘీభావం తెలుపుతూ   గిరిజన విద్యార్థి సంఘం నాయకులు, మొడ్ బాలాజీ నాయక్, కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు బొర్రా సురేష్, మద్దతు తెలుపుతూ   దీక్షలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  రెవెన్యూ వ్యవస్థకు పునాదిరాళ్లు వంటి  వీఆర్ఏల సమస్యలు    తక్షణం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సంఘీభావం తెలిపిన వారిలో  ఎల్ హెచ్ పి  ఎస్ జిల్లా అధ్యక్షుడు రాంబాబు,నాయక్ ట్రేడ్ యూనియన్ డిస్ట్రిక్ కన్వీనర్   కృష్ణయ్య  సీత రాములు తదితరులు పాల్గొన్నారు.