పవన్ వ్యాఖ్యలకు లోకేశ్ కౌంటర్
టిడిపితో మోసపోయామని చెప్పడంపై మండిపాటు
అమరావతి,నవంబర్21(జనంసాక్షి): గత ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ఇచ్చి మోసాపోయానని, కొన్ని పార్టీలకు అలాగే జరిగిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను మంత్రి నారా లోకేశ్ తప్పు బట్టారు. టీడీపీ పొత్తు పెట్టుకున్నవాళ్లు ఎలా మోసపోయారో పవన్ చెప్పాలని ఆయన ప్రశ్నించారు. పవన్ ఎప్పుడు అడిగితే అప్పుడు సీఎం అపాయింట్మెంట్ ఇచ్చామని చెప్పారు. అవిశ్వాస తీర్మానం పెడితే ఢిల్లీని వణికిస్తానని చెప్పి పవన్ ఫాంహౌస్లో పడుకున్నాడని ఎద్దేవా చేశారు. ¬దా గురించి పవన్ ఎందుకు ఇప్పడు మాట్లాడటం లేదని లోకేశ్ ప్రశ్నించారు. రాఫెల్ కుంభకోణం, పెట్రోల్ ధరల గురించి ఎందుకు మాట్లాడటం లేదని విమర్శించారు. జగన్కు కేసులు ఉన్నాయి కాబట్టి జగన్ భయపడుతున్నారన్నారు. కడప ఉక్కు ఫ్యాక్టరీ గురించి కూడా పవన్ భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. కోడికత్తి కేసు గురించి మాట్లాడటానికి లేఖలు రాయడానికి టైం ఉందిగాని ¬దా గురించి మాట్లాడేందుకు పవన్కు సమయం ఉండటం లేదని, కోడి కత్తి చేయించింది సీఎం అనే చెబితే ఆయన ఎలా ఫోన్ చేసి మాట్లాడతారని లోకేశ్ ప్రశ్నించారు.