పశువులకు ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరం

పశువులకు ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరం

సంగెం ప్రతినిధి: సెప్టెంబర్ 2023 (జనం సాక్షి)
సంగెం మండలంలోని నార్లవాయి గ్రామంలో పశు సంవర్డక శాఖ, జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరం నిర్వహించనైనది. ఈ శిబిరాన్ని స్థానిక సర్పంచ్ కోడూరి రజిత రమేష్ , ఉపసర్పంచ్ మాదినెని కోటి, సంగెం మండల పశు వైద్యాధికారి డాక్టర్ వల్లే.రాజు శిబిరాన్ని ప్రారభించారు . ఈ శిబిరానికి వచ్చిన 85 పాడి పశువులకు గర్భకోశ వ్యాధులకు చికిత్సలు చేసి పశువుల కు ఉచితముగా మందులు పంపిణీ చేయనైనధి,పశువులకు నట్టల నివారణ మందులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గోపాలమిత్ర సూపర్వైజర్ ఎం. అనిల్ గోపాలమిత్రలు బి. కమలాకర్. వీరేశం , బాబు,రాజు గ్రామస్తులు పాడి రైతులు తదితరులు పాల్గొన్నారు.