పాకిస్తాన్‌లో భారీ వర్షాలు…

కరాచీలో 10మంది మృతి

కరాచీ : ఉత్తర భారతంలోనే కాదు పాకిస్తాన్‌లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాణిజ్య రాజధాని కరాచీ నగరంలో 36 గంటలుగా ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. ఇళ్లు కూలి, గోడలు పడిపోయి 10 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. అనేకచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. వరద నీటిని తొలగించేందుకు వారం రోజులు పడుతుందని అధికారులు చెప్పారు.