పాక్‌లో పేలిన మానవబాంబు

lpiciwkyఓ ఉగ్రవాది తనను తాను బాంబులతో పేల్చుకోవడంతో పాక్‌కు చెందిన ఇద్దరు పోలీసు అధికారులు తీవ్రంగా గాయపడ్డారు. కరాచీలోని మాలిర్స్ రిఫా ఐ ఆమ్ సొసైటీలోని జనావాస భవనంలో మిలిటెంట్లు దాగి ఉన్నారన్న సమాచారంతో పాక్ పోలీసులు, రేంజర్లు, ఇంటెలిజెన్స్ అధికారులు ఆదివారం ఉదయం దాడిచేశారు. ఇరు వైపులా తీవ్రంగా కాల్పులు జరిగిన అనంతరం పోలీసులు భవనంలోకి ప్రవేశించగా.. మిలిటెంట్ డిటోనేటర్లు ఉన్న జాకెట్‌ను పేల్చుకుని ఆత్మాహుతికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు గాయపడినట్లు సీనియర్ ఎస్పీ రావ్ అన్వర్ మీడియాకు చెప్పారు.