పాట్నాలో భాజపా నేతల సమావేశం

పాట్నా : బీహార్‌ ఉప ముఖ్యమంత్రి సుశీల్‌ మోడీ నివాసంలో భారతీయ జనతా పార్టీ నేతల సమావేశం ప్రారంభమైంది. మరి కాసేపట్లో జరిగే మంత్రివర్గ సమావేశానికి గైర్హాజరు కావాలని భాజపా మంత్రులు నిర్ణయించినట్లు సమాచారం. ఉప ముఖ్యమంత్రి సుశీల్‌ మోడీకి భాజపా మంత్రులు రాజీనామా సమర్పిస్తారని ఆ పార్టీ నేత సీపీ ఠాకూర్‌ తెలిపారు. ఈరోజు ఉదయం 11.30 గంటలకు మంత్రివర్గ అత్యవసర సమావేశానికి ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే.