పాత నగరం అభివృద్ధికి బృహత్‌ ప్రణాళిక

పాతబస్తీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం:మంత్రి కేటీఆర్‌
బృహత్‌ సంకల్పంతో ముందుకు వెళతాం
పర్యాటక ప్రాంతాల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి
నగరం నలుదిశలా విస్తరించేలా ప్రణాళికలు
ఉన్నస్థాయి సవిూక్షలో మంత్రి కేటీఆర్‌
హర్షం వ్యక్తం చేసిన అక్బరుద్దీన్‌ ఓవైసీ
హైదరాబాద్‌(జనంసాక్షి): పాతబస్తీ అభివృద్ధిపై పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఉన్నతస్థాయి సవిూక్ష నిర్వహించారు. నగర అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం తొలి నుంచి పాటుపడు తుందని, ఇప్పటికే హైదరాబాద్‌ నగరం నలుదిశలా విస్తరిస్తూ అద్భుతమైన ప్రగతితో ముందుకు పోతున్నదన్నారు. ప్రాంతాలు, పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్తున్నామని స్పష్టం చేశారు. హైదరాబాద్‌ గ్రోత్‌ కారిడార్‌ లిమిటెడ్‌ కార్యాలయంలో జరిగిన సవిూక్షా సమావేశంలో హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ, ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ ఒవైసీ, చేవెళ్ల ఎంపీ రంజిత్‌ రెడ్డి, సీఎస్‌ శాంతి కుమారి, మున్సిపల్‌ శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రెటరీ అరవింద్‌ కూమార్‌, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, జలమండలి, విద్యుత్‌ శాఖతో పాటు జిల్లా కలెక్టర్‌, వివిధ శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులు హాజరయ్యారు. పాతబస్తీలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను అధికారులు సమావేశంలో అందజేశారు. జీహెచ్‌ఎంసీ చేపట్టిన ఎస్‌ఆర్‌డీపీ కార్యక్రమంలో భాగంగా పాతబస్తీలోనూ భారీగా రోడ్డు నెట్వర్క్‌ బలోపేతానికి సంబంధించిన కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని, ఇందులో ఇప్పటికీ పలు ఫ్లై వర్లు, రోడ్ల నిర్మాణం పూర్తయ్యిందని కేటీఆర్‌ పేర్కొన్నారు. కార్యక్రమం కింద దాదాపు వందల కోట్లతో నిధులతో అనేక పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. జీహెచ్‌ఎంసీ చేపట్టిన సీఆర్‌ఎంపీ కార్యక్రమం ద్వారా ప్రధాన రోడ్ల నిర్వహణ సైతం ప్రభావవంతంగా సాగుతుందన్నారు. జనావాసాలు అధికంగా ఉన్న పాతబస్తీలాంటి ప్రాంతాల్లో రోడ్డు వైడనింగ్‌ కార్యక్రమం కొంత సవాల్‌తో కూడుకున్నదని, అయితే రోడ్డు వైడనింగ్‌ తప్పనిసరి అయినా ప్రాంతాల్లో ఇందుకు సంబంధించిన పనులను వేగవంతం చేయాలని అధికారులను అదేశించారు. అభివృద్ది కార్యక్రమాల కోసం అవసరమైన మరిన్ని భూసేకరణ నిధులను అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.ట్రాఫిక్‌ జంక్షన్లతో పాటు ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిల నిర్మాణం, అవసరమైన చోట మూసీపై బ్రిడ్జిల నిర్మాణాన్ని వేగంగా కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. చార్మినార్‌ పెడెస్టియ్రన్‌ ప్రాజెక్టు పనులు సైతం దాదాపుగా పూర్తి కావచ్చాయని తెలిపారు. ప్రతి ఒక్కరికీ సరిపడా తాగునీరు అందించాలన్న బృహత్‌ సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం  ముందుకుపోతున్నదని, అందులో భాగంగా హైదరాబాద్‌ నగరంలోని తాగునీటి సరఫరా సంతృప్తికర స్థాయిలో ఉందని కేటీఆర్‌ తెలిపారు. గత ఎనిమిదేళ్లలో పాతబస్తీ పరిధిలోను తాగునీరు సరఫరా మెరుగుపడిరదన్నారు. ఇందుకోసం వివిధ తాగునీటి సౌకర్యాల అభివృద్ధికి సుమారు రూ.1200 కోట్లకుపైగా ఖర్చు చేసినట్లు కేటీఆర్‌ పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఉచిత తాగునీటి సరఫరా పథకంలో భాగంగా పాతబస్తీలో రెండున్నర లక్షలకుపైగా నల్లా కనెక్షన్ల ద్వారా ఉచిత తాగునీరు అందుతుందని కేటీఆర్‌ తెలిపారు. జలమండలి ద్వారా మురికి నీటి వ్యవస్థ బలోపేతానికి అనేక కార్యక్రమాలు తీసుకున్నట్లు తెలిపారు. ఇందుకోసం పాతబస్తీ పరిధిలో వివిధ ప్రాంతాల్లో సీవర్‌ ట్రీట్మెంట్‌ ఎª`లాంట్ల నిర్మాణంతో పాటు ఇతర కార్యక్రమాలను జలమండలి చేపట్టిన విషయాన్ని ఈ సందర్భంగా కేటీఆర్‌ ప్రస్తావించారు. హైదరాబాద్‌తో పాటు పాతబస్తీలోను విద్యుత్‌ సరఫరా వ్యవస్థ అద్భుతంగా మెరుగైందని తెలిపారు. పారిశుధ్య నిర్వహణ విషయంలోనూ జీహెచ్‌ఎంసి తీసుకున్న ప్రత్యేక చర్యలతో పాతబస్తీలో పరిస్థితి మార్పువచ్చిందన్నారు. ముఖ్యంగా చార్మినార్‌, చౌమహల్లా ప్యాలెస్‌, మదీనా, మక్కా మసీద్‌, సాలార్‌జంగ్‌ మ్యూజియం తదితర పర్యాటక ప్రాంతాల్లో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టామని కేటీఆర్‌ పేర్కొన్నారు. వైద్య ఆరోగ్య రంగంలోనూ తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న అన్ని రకాల ప్రభుత్వ పథకాల అమలుతో పాటు, ప్రత్యేకంగా 84 బస్తీ దవాఖానాలను ఇప్పటిదాకా పాతబస్తీలో ఏర్పాటు చేసినట్లు కేటీఆర్‌ పేర్కొన్నారు. ప్రభుత్వ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో విూర్‌ ఆలం మండి మార్కెట్‌ రిస్టోరేషన్‌ కోసం పురపాలక శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ప్రణాళికలు సిద్ధంగా చేసినట్లు తెలిపారు. విూర్‌ ఆలం ట్యాంక్‌ పైనుంచి ఆరు లైన్ల కేబుల్‌ బ్రిడ్జ్‌ నిర్మాణ ప్రతిపాదనలు సైతం డీపీఆర్‌ దశలో ఉన్నట్లు తెలిపారు. హైదరాబాద్‌ నగరంలో ఉన్న అనేక వారసత్వ కట్టడాలు, వారసత్వ సంపద ప్రధానంగా పాతబస్తీలో ఉన్న నేపథ్యంలో, వాటిని రక్షించడంతోపాటు పునరుజ్జీవన కార్యక్రమాలను సైతం పెద్ద ఎత్తున చేపట్టిన అంశాన్ని కేటీఆర్‌ సమావేశంలో ప్రస్తావించారు. హైదరాబాద్‌ అభివృద్ధిలో పాతబస్తీ ప్రగతికి ప్రాధాన్యం ఇవ్వడంపై సంతృప్తి వ్యక్తం చేసిన అక్బరుదుద్దీన్‌ ఒవైసీ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వానికి, ప్రధానంగా మంత్రి కేటీఆర్‌కు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు అదనంగా పాతబస్తీలో చేపట్టాల్సిన పలు కార్యక్రమాలను మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగంగా అమలు చేసేందుకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను, క్షేత్రస్థాయిలో అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ విషయంలో ప్రభుత్వ శాఖలతో కలిసి పని చేస్తామని అక్బరుద్దీన్‌ ఓవైసీ పేర్కొన్నారు.