పాపికొండలకు పర్యాటక శోభ

ఏలూరు,జనవరి14(జ‌నంసాక్షి): సంక్రాంతి వరుస సెలవుల నేపథ్యంలో.. పాపికొండల విహారయాత్రకు పర్యాటకులు పోటెత్తారు. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం, దేవీపట్నం మండలంలోని అంగుళూరు నుంచి వందలాదిమంది పర్యాటకులు పాపికొండల అందాలు తిలకించడానికి పయనమయ్యారు. తొలుత గోదావరి నది ఒడ్డనున్న గండిపోశమ్మ అమ్మవారి దర్శనానికి బారులుదీరారు. పర్యాటకులతో సుమారు గంటపాటు ఆలయంలో రద్దీ కొనసాగింది. మూడ్రోజుల వరకు పాపికొండల విహారయాత్ర రద్దీ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. పర్యాటక బోట్లను తనిఖీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. పరిమితికి మించి పర్యాటకులను తీసుకెళ్లే బోట్ల అనుమతులు రద్దుచేస్తామని స్పష్టంచేశారు.