పార్లమెంట్‌లో తెలంగాణ, కాంగ్రెస్‌ ఎంపీల బైఠాయింపు

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ శీతకాల సమావేశాలకు తెలంగాణ సెగ తగిలింది. తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ఎంపీలు పార్లమెంట్‌లో తెలంగాణవాదాన్ని వినిపించడానికి సిద్ధమయ్యారు. పార్లమెంట్‌ ఒకటో నెంబరు ప్రధాన ద్వారం వద్ద ఎంపీలు బైఠాయించారు. పార్లమెంట్‌లో వెంటనే తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టాలని ఎంపీలు డిమాండ్‌ చేస్తున్నారు. తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టకపోతే సభను స్తంభింపజేస్తామని ఎంపీలు హెచ్చరిస్తున్నారు. తాడోపేడో తేల్చుకుంటామని ఎంపీలు భీష్మీంచి కూర్చున్నట్లు సమాచారం.