పార్లమెంట్‌ ఆవరణలో టీడీపీ ఎంపీల నిరసన

– ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ నినాదాలు

– రాముడి వేషదారణలో ఎంపీ శివప్రసాద్‌

న్యూఢిల్లీ, ఆగస్టు6(జ‌నం సాక్షి ) : ఏపీ విభజన హావిూలు, ప్రత్యేక ¬దా కోసం ఢిల్లీలో టీడీపీ ఎంపీల పోరాటం కొనసాగుతోంది. సోమవారం కూడా ఎంపీలు పార్లమెంట్‌ ఆవరణలో నిరసనను తెలియజేశారు. ఏపీకి ఇచ్చిన హావిూలను వెంటనే అమలు చేయాలంటూ ప్లకార్డులతో ధర్నా చేపట్టారు. రాష్ట్రానికి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. వెరైటీ వేషాలతో నిరసన తెలియజేసే చిత్తూరు ఎంపీ శివప్రసాద్‌ సోమవారం శ్రీరాముడి అవతారంలో కనిపించారు. పాటలు, పద్యాలతో ఏపీకి జరిగిన అన్యాయాన్ని వివరించే ప్రయత్నం చేశారు. ఎన్నికల సమయంలో బీజేపీవాళ్లు శ్రీరాముడి పేరు చెప్పుకొని.. రామతత్వమంటూ మాయ చేశారని ఎంపీ శివప్రసాద్‌ అన్నారు. జనాల ఓట్లు దండుకొని.. పదవుల్లోకి వచ్చాక వారిని మోసం చేస్తున్నారని విమర్శించారు. రాముడిది ఒకే మాట, ఒకే బాటని.. మాట ఇస్తే దాని నిలబడే మ¬న్నత వ్యక్తన్నారు. మిత్రభావంతో వచ్చినవారిని రాముడు అండగా ఉండేవాడని.. చంద్రబాబు కూడా మిత్ర భావంతో మోదీకి మద్దతు పలికారన్నారు. శ్రీరాముడి పేరు చెప్పుకొనే బీజేపీ మాత్రం మిత్ర ధర్మాన్ని పాటించకుండా.. ఏపీకి ఇచ్చిన హావిూలను నెరవేర్చలేదన్నారు. ప్రధాని మోదీ

రామరాజ్య ధర్మాన్ని విస్మరించారని శివప్రసాద్‌ విమర్శించారు.