పార్లమెంట్‌ ఉభయ సభలు వాయిదా

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. లోక్‌సభ ఈ ఉదయం ప్రారంభంగానే మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్‌, భోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటన మృతులకు సంతాపం తెలిపింది. తర్వాత రేపలికి వాయిదా పడింది. ఐకే గుజ్రాల్‌ మరణానికి సంతాపం ప్రకటిస్తూ పెద్దల సభలో సభ్యులు రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంతరం రాజ్యసభ కూడా రేపటికి వాయిదా పడింది.