పాశంవారి గూడెంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించిన పాశం అలివేలమ్మ

 

 

కొండమల్లేపల్లి ఫిబ్రవరి 16 (జనంసాక్షి) న్యూస్ : గుర్రంపూడ్ మండల కేంద్రంలో గురువారం నాడు పాశంవారిగూడెం లో సర్పంచ్ పాశం అలివేలమ్మ కంటి వెలుగు కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు పాశం గోపాల్ రెడ్డి సర్పంచ్ పాశం అలివేలమ్మతో కలిసి మాట్లాడుతూ పేదల కళ్ళల్లో ఆనందం నింపడం కోసమే కంటి వెలుగు కార్యక్రమం అన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం ప్రజలకు కంటి పరీక్షలను వైద్యుల బృందం నిర్వహించారు కంటివెలుగు శిబిరాన్ని ప్రారంభించిన అనంతరం పాశం గోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ముందు చూపుతో రాష్ట్రంలో ప్రజలందరికీ కంటి వెలుగు కార్యక్రమాన్ని మొదటి విడత ప్రారంభించి అనేకమందికి కంటి అద్దాలను అందించారని, తిరిగి రెండో విడత కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా చేపట్టారన్నారు. ప్రజలు ఎవరూ కంటి సమస్యలతో బాధపడవద్దనే లక్ష్యంతో కంటి పరీక్షలను నిర్వహించి అద్దాలతో పాటు మందులు ఉచితంగా పంపిణీ చేస్తున్నారని, అవసరమైన వారికి కంటి ఆపరేషన్లను సైతం చేయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు గతంలో పాలనలో ఉన్న ఏ ప్రభుత్వాలు ఇలాంటి మహోన్నతమైన కార్యక్రమాల్ని చేపట్టలేదని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రజల ఆరోగ్య సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ఆసుపత్రులలో చికిత్స పొందిన వారికి ఎల్ ఓ సి లను అందిస్తూ వారి ఆరోగ్యాన్ని కాపాడుతున్నారన్నారని ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలను అందిస్తూ కుటుంబంలో పెద్దకొడుకులా వ్యవహరిస్తున్నారన్నారని రానున్న రోజుల్లో మరిన్ని సేవ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు అందించడమే ముఖ్యమంత్రి లక్ష్యమని పేర్కొన్నారు అనంతరం పలువురు కంటి పరీక్షలు నిర్వహించుకున్న వారికి మందులు, అద్దాలను అందించారు ఈ ఈ కార్యక్రమంలో పాశంవారి గూడెం సెక్రటరీ మమత, డాక్టర్ అశోక్, సూపర్వైజర్ డాక్టర్ జగదీష్, ఏఎన్ఎంలు బి హారతి, శైలజ, డీఈవో ఎస్ అలేఖ్య, డి ఏ ఓ వి.గణేష్, ఆశా వర్కర్స్ పి శ్రీలత, జి లక్ష్మమ్మ, ఈ యాదమ్మ గ్రామ వార్డు సభ్యులు ప్రజలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు