పిచ్చికుక్క కాటుకు గాయపడ్డ ఎనిమిది మంది

మరిపెడ (వరంగల్‌జిల్లా), సెప్టెంబరు 13 : జిల్లాలోని మరిపెడలో పిచ్చికుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. జయారం గ్రామంలో పిచ్చికుక్క కాటుకు 8 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని మహబూబాబాద్‌ ఏరియా ఆస్పత్రికి తరలించారు. గాయపడినవారిలో వృద్ధులు కూడా ఉన్నారు. గతంలో పిచ్చికుక్క కాటుకు ముగ్గురు చనిపోవడంతో గ్రామస్తులు బెంబేలెత్తిపోతున్నారు