పిడుగుపాటుకు 23 మేకలు మేకలు మృతి

*గుడిహత్నూర్: అక్టోబర్ 14( జనం సాక్షి) పిడుగుపాటుకు 23 మేకలు మృతి చెందిన సంఘటన గూడిహత్నూర్ మండల పరిధిలోని మాల్కాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. శుక్రవారం సాయంత్రం ఉరుములు మెరుపులతో కురిసిన భారీ వర్షానికి పిడుగు పడి గ్రామానికి చెందిన పెందూర్ రాము కు చెందిన మేకలను మేపడనికి అటవీ ప్రాంతానికి వెళ్ళాడు
పిడుగులు పడడంతో అక్కడికక్కడే మృతి చెందాయి. కాపర్లకు ఎలాంటి ప్రాణాష్టం జరగకపోగా మేకలు మాత్రం మృతి చెందాయి. ప్రభుత్వం వీరిని ఆదుకోవాలని గ్రామస్తులు స్థానికులు కోరుతున్నారు. 3లక్షల విలువ చేసే మేకలు మృతి చెందడంతో యజమాని రాము ఆయన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు