పీవీకి భారతరత్న రావడం పట్ల సీఎం రేవంత్రెడ్డి హర్షం

 హైద‌రాబాద్ : భార‌త మాజీ ప్ర‌ధాని, బ‌హుభాషా కోవిదుడు, తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ న‌ర‌సింహారావుకు కేంద్రం భార‌త‌ర‌త్న ప్ర‌క‌టించడంపై సీఎం రేవంత్ రెడ్డి హ‌ర్షం వ్య‌క్తం చేశారు. పీవీకి భార‌త‌ర‌త్న ప్ర‌క‌టించ‌డాన్ని స్వాగ‌తిస్తున్నామ‌ని సీఎం పేర్కొన్నారు. ఆర్థిక సంస్క‌ర‌ణ‌లు తెచ్చి ఈ దేశాన్ని అభివృద్ధి ప‌థంలో న‌డిపించార‌ని కొనియాడారు. పీవీ న‌ర‌సింహారావు కుటుంబానికి తెలంగాణ ప్ర‌జ‌ల త‌ర‌పున రేవంత్ రెడ్డి శుభాకాంక్ష‌లు తెలిపారు.పీవీ న‌ర‌సింహారావుతో పాటు ఎంఎస్ స్వామినాథ‌న్, చౌద‌రీ చ‌ర‌ణ్ సింగ్‌కు ఇవాళ కేంద్రం భార‌త‌ర‌త్న ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం క‌ర్పూరీ ఠాకూర్, ఎల్‌కే అద్వానీకి భార‌త‌ర‌త్న ప్ర‌క‌టించ‌గా, మొత్తం ఈ ఏడాదికి ఐదుగురికి కేంద్రం భార‌త‌ర‌త్న అవార్డుల‌ను ప్ర‌క‌టించిన‌ట్లైంది.