పీవీ సింధుకు మంత్రి పువ్వాడ అభినందనలు
ఖమ్మంలో నిర్వహించే అభినందన సభకి రావాలని ఆహ్వానం
వస్తానని హావిూ ఇచ్చిన సింధు
హైదరాబాద్,ఆగస్ట్5( జనంసాక్షి): టోక్యో ఒలంపిక్స్ లో కాంస్య పతకాన్ని సాధించిన పీవీ సింధుకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అభినందనలు తెలియజేశారు.ఒలింపిక్స్ ముగించుకుని హైదరాబాద్ కు చేరుకున్న సింధు నివాసానికి వెళ్లి తనను కలిసి అభినందలను తెలియజేశారు. శాలువతో సత్కరించి, శ్రీశ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటాన్ని బహుకరించి అభినందలు తెలిపారు.ఈ సందర్భంగా వారి తల్లిదండ్రులు ఇరువురు వాలీబాల్ క్రీడాకారులు రమణ, విజయని కలిసి అభినందనలు తెలిపారు. రమణ సైతం అర్జున్ అవార్డు గ్రహీత. ఈ సందర్భంగా ఒలింపిక్స్కు సిద్ధం అయిన తీరు, తదితర అంశాలపై చర్చించారు. అనంతరం తన మెడల్స్ రూమ్ కి తీసుకెళ్లి పతకాలను వివరించారు. ఒలింపిక్స్ లో వచ్చిన పథకం, అర్జున్ అవార్డు, తదితర పథకాలను చూపించి వాటి ప్రాముఖ్యత ను మంత్రికి వివరించారు. ఖమ్మం క్రీడాకారుల కోరిక మేరకు ఖమ్మం లో చేపట్టే సన్మాన వేడుకకు రావాలని మంత్రి పువ్వాడ కోరారు.
అందుకు ఆమె సంతోషం వ్యక్తం చేసి వచ్చేందుకు అంగీకరించారు.అనంతరం మంత్రి విూడియాతో మాట్లాడుతూ..వరుసగా రెండు ఒలంపిక్స్ లలో మెడల్స్ సాధించిన ఫస్ట్ ఇండియన్ ఉమెన్ గా రికార్డ్ క్రియేట్ చేసిందన్నారు. వరుసగా ఒలంపిక్స్ లలో మెడల్స్ సాధించడం గర్వించదగ్గ విషయమని, రెండు తెలుగు రాష్టాల్రకు గర్వకారణమన్నారు.భారత బ్యాడ్మింటన్ కి సింధు ఐకాన్ గా మారిపోయిందని, వచ్చే ఒలంపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధిస్తుందన్న నమ్మకం ఉందన్నారు.సింధుకి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పడు అండగా ఉంటూ, ప్రోత్సాహం అందిస్తుందని, తెలంగాణ ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు క్రీడలకు పెద్ద పీట వేస్తున్నారన్నారు